calender_icon.png 30 September, 2024 | 12:59 PM

పంచాయతీ కార్మికుడు ఆత్మహత్య

29-09-2024 12:11:29 AM

అశ్వారావుపేట, సెప్టెంబర్ 28: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం  సీతారాంపురం, అన్నారం గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు  పొడియం నారాయణ(57) శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ములకలపల్లి ఎస్సై కిన్నెర రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. అన్నారం గ్రామానికి చెందిన పొడియం నారాయణ పంచాయతీ కార్మికుడిగా పనిచేస్తున్నాడు.

అనారోగ్యంతో బాధపడుతుండటంతో తన కుమారుడు రాజారావు శుక్రవారం పనికి వెళ్లవద్దని చెప్పాడు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున ఇంటి నుంచి బయటకు వెళ్ని నారాయణ గ్రామశివారులో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.