తుది జాబితా విడుదల
పురుషులు 82 లక్షలు, మహిళలు 85 లక్షల పైనే
నల్లగొండ జిల్లాలో అత్యధికం.. మేడ్చల్లో అత్యల్ప ఓటర్లు
హైదరాబాద్, అక్టోబర్ 3 (విజయక్రాంతి): గ్రామపంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు వేగవంతం చేసింది. ఇందు కోసం తాజాగా పంచాయతీల ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. రాష్ట్రంలోని 538 మండలాల్లో మొత్తం 12,867 గ్రామ పంచాయతీలు ఉండగా, 1,13,722 వార్డులు ఉన్నాయి.
వీటిలో మొత్తం 1,67,33,548 మంది ఓటర్లు ఉన్నారని ఈసీ పేర్కొంది. మొత్తం పంచాయతీ ఓటర్లలో 82,04,518 మంది పురుషులు, మహిళా ఓటర్లు 85, 28,573, ఇతరులు 493 మంది ఉన్నట్టు స్పష్టం చేసింది. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 10,42,545 మంది ఓటర్లు ఉండ గా, అత్యల్పంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లో 64,397 మంది ఓటర్లు ఉన్నారు.
జిల్లాలవారీగా పంచాయతీ ఓటర్లు
ఆదిలాబాద్ 4,41,795
భద్రాద్రి కొత్తగూడెం 6,23,947
హనుమకొండ 3,65,832
జగిత్యాల 5,93540
జనగామ 4,09,797
భూపాలపల్లి 2,90,663
జోగులాంబ గద్వాల 3,88,195
కామారెడ్డి 6,36,362
కరీంనగర్ 5,27,237
ఖమ్మం 8,52,878
ఆసిఫాబాద్ 3,48,370,
మహబూబాబాద్ 5,52,192
మహబూబ్నగర్ 5,16,183
మంచిర్యాల 3,78,934
మెదక్ 5,12,278
మేడ్చల్ 64,397
ములుగు 2,37,858
నాగర్కర్నూల్ 6,46,407
నల్లగొండ 10,42,545
నారాయణపేట 4,03,748
నిర్మల్ 4,40,651
నిజామాబాద్ 8,30,580
పెద్దపల్లి 4.07,716
రాజన్న సిరిసిల్ల 3,46,259
రంగారెడ్డి 7,94,653
సంగారెడ్డి 8,34,360
సిద్దిపేట 6,14,371
సూర్యాపేట 6,82,882
వికారాబాద్ 6,71,940
వనపర్తి 3,67,521
వరంగల్ 3,89,052
యాదాద్రి 5,20,441