calender_icon.png 24 October, 2024 | 3:48 PM

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

12-09-2024 01:45:20 PM

నిజామాబాద్,(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లాలోని నందిపేట్ మండల కేంద్ర గ్రామ పంచాయతీ కార్యదర్శి ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసిబిడి ఎస్ పి శేఖర్ గౌడ్ తెలిపిన వివరాలు ప్రకారం... నందిపేట్ పంచాయతీ కార్యదర్శి నవీన్, నందిపేట్ మండలం కంఠం గ్రామానికి చెందిన వ్యక్తి నుంచి 2000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి పట్టుకున్నారు. ఏసీబీకి పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి నవీన్ ఉమ్మెడ గ్రామానికి చెందిన వ్యక్తి, ఇతను ఈ మధ్యే నందిపేట్ పంచాయతీ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు.