13-04-2025 06:18:46 PM
బెల్లంపల్లి,(విజయశాంతి): బెల్లంపల్లి పట్టణంలో సిఎస్ఐ చర్చి ప్రజీబీటర్ ఇన్చార్జి సిహెచ్ అశోక్ ఆధ్వర్యంలో మట్టల ఆదివారం సందర్భంగా కమిటీ సభ్యులు, క్రైస్తవులు ఊరేగింపు నిర్వహించారు. గతంలో ఏసుప్రభు గాడిదపై వస్తుంటే ప్రజలు ఆకులు, బట్టలు పరుస్తూ ఖాళీ భూమి మీద నడవకుండా మట్టలు పరిచి ఊరేగించారు. ఇదే విధంగా పరిశుద్ధాత్మ అయిన దేవుడు యేసు ప్రభువుని కూడా ప్రజీబీటర్ ఇన్చార్జి సిహెచ్ అశోక్ అయ్యగారు, సంఘ సభ్యులు ఊరేగింపుగా మట్టలుపరిచే కార్యక్రమాన్ని చేపట్టారు.