calender_icon.png 3 October, 2024 | 10:06 AM

శంకరాచార్యకు పాదుక పూజ

03-10-2024 02:16:33 AM

  1. అన్నపూర్ణ బోళానంద ఆశ్రమంలో స్వామీజీకి ఘనస్వాగతం
  2. హావ్‌డా శంకర్‌మఠ్‌లో సూర్యోపాసన నిర్వహించిన జ్మోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి

కోల్‌కతా, అక్టోబర్ 2: మహారాష్ట్రలో గోమాత రాజ్యమాత కార్యక్రమానికి హాజరై న అనంతరం పశ్చిమబెంగాల్‌కు జ్మోతిర్మఠ్ పీఠాధిపతి శంకరాచార్య అవిముక్తేశ్వరానం ద్ స్వామిజీ తిరిగి చేరుకున్నారు. కోల్‌కతా లో బుధవారం నిర్వహించిన పలు కార్యక్రమాల్లో శంకరాచార్య స్వామీజీ పాల్గొన్నారు. తొలుత హావ్‌డాలోని శంకర్‌మఠ్‌కు చేరుకు న్న స్వామీజీ.. అక్కడ సూర్యోపాసన చేశారు.

అనంతరం అన్నపూర్ణ బోళానంద ఆశ్రమా న్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమ యాజమాన్యం, భక్తులు ఘనస్వాగతం పలికారు. ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఆశ్రమంలో శంకరాచార్య స్వామీజీకి భక్తులు పాదుక పూజ నిర్వహించారు. తర్వాత గోడియా వైష్ణ వ సన్యాసులను స్వామీజీ కలుసుకున్నారు. వారు కూడా అవిముక్తేశ్వరానంద్ సరస్వతి స్వామీజీకి పాదుక పూజ చేశారు. కాగా, శుక్రవారం కోల్‌కతాలో స్వామీజీ గోధ్వజ్‌ను స్థాపిస్తారు.