12-04-2025 06:00:07 PM
వారసిగూడ (విజయక్రాంతి): సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు గౌడ్ శనివారం వారసిగూడలో వివిధ ప్రాంతాల్లో హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి హనుమాన్ జయంతి శోభా యాత్రను ప్రారంభించారు. సీతాఫలమండీ, ప్రాంతాల్లో హనుమాన్ జయంతి వేడుకల్లో పద్మారావు గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధ్యాత్మికత, అన్నీ విలువల ప్రేరణకు హనుమంతుడు స్పూర్తిగా నిలుస్తాడని అన్నారు. హనుమాన్ జయంతి ర్యాలీలు సాఫీగా నిర్వహించుకొనేలా పోలీసులు సహకరించాలని సూచించారు. యువ నేత కిశోర్ కుమార్ గౌడ్ తో పాటు కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.