calender_icon.png 17 October, 2024 | 4:54 AM

ఎన్నికల్లో పద్మశాలీలు సత్తా చాటాలి

17-10-2024 02:28:10 AM

పద్మశాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మురళి

కరీంనగర్, అక్టోబరు 16 (విజయక్రాంతి): పద్మశాలీల్లో రాజకీయ చైతన్యం రావాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పద్మశాలీలు సత్తా చాటాలని తెలంగాణ పద్మశాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామర్తపు మురళి అన్నారు. బుధవారం కరీం నగర్‌లోని పద్మశాలీ భవనంలో సంఘం రాష్ట్ర విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పద్మశాలీలు చట్టసభల్లో గు ర్తింపు తెచ్చుకోవల్సిన అవసరం ఉందన్నారు. 20 ఏళ్ల క్రితం రాజకీయంగా పద్మశా లీలు ఎంతో ముందుండేవారని, నేడు అవకాశాలను చేజార్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘం మాజీ అధ్యక్షుడు మచ్చ ప్రభాకర్‌రావు ఆశయాల కోసం తెలంగాణ పద్మశాలీ సంఘం ముందుకు వెళ్తుం దని అన్నారు.

ఈ కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలీ సంఘం జాతీయ అధ్యక్షు డు కందగట్ల స్వామి, జాతీయ ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, పద్మశాలీ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు మెతుకు సత్యం, రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ వాసాల రమేష్, రాష్ట్ర కార్యదర్శి వొల్లాల కృష్ణహరి, కార్పొరేటర్లు చొప్పరి జయశ్రీ, లెక్కల వేణుగోపాల్, మాజీ జడ్పీటీసీ ఇప్పలపల్లి సాంబయ్య, మాజీ ఎంపీపీ అరకాల వీరేశలింగం, గడ్డం వెంకటేశం పాల్గొన్నారు.