22-02-2025 06:21:28 PM
ఎస్ఆర్ఎస్పి జలాలు పూర్తిస్థాయిలో అందక రైతుల గోస
తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని పలు గ్రామాలతో పాటు జాజిరెడ్డిగూడెం మండలం కొమ్మాలలో నూతనకల్ మండలం శిల్పకుంట గ్రామ శివారులోని పలు రైతుల వ్యవసాయ భూములకు(Farmers' Agricultural Lands) పూర్తిస్థాయిలో ఎస్సారెస్పీ జలాలు(SSRS Waters) అందకపోవడంతో వరి పైర్లు ఎండి గొర్రెలకు, పశువులకు పచ్చి మేతగా మారడంతో తాము పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.