హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ హాల్ లో ప్రజాపద్దుల కమిటీ సమావేశం జరుగుతోంది. ఛైర్మన్ అరికపూడి గాంధీ అధ్యక్షతన పీఏసీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో కమిటీ సభ్యులు, సీఎస్ శాంతి కుమారి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పీఏసీ సమావేశానికి బీఆర్ఎస్ నేతలు దూరంగా ఉన్నారు. బీఆర్ఎస్ నేతలు ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎల్. రమణ పీఏసీ భేటీకి హాజరుకాలేదు.