హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 19 (విజయక్రాంతి): పంజా గుట్టలోని ప్రజాభవన్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. శనివారం ఉద యం అతివేగంతో దూసుకువచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా కొట్టింది. రోడ్డుపై పడిన కంకరతోనే కారు అదుపుతప్పినట్లు తెలు స్తోంది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసు లు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కార్యాలయాలకు వెళ్లే సమ యం కావడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ప్రమాదానికి గురైన కారును అక్కడి నుంచి తరలించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు.