రూ.8 లక్షల సామగ్రి స్వాధీనం
హనుమకొండ, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): వరంగల్ నగరంలోని బేకరీలపై ఫుడ్సెఫ్టీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. రూ. 8 లక్షల విలువ గల కాలం చెల్లిన పదార్థాలను సీజ్ చేసినట్టు ఏసీపీ మధుసూదన్ తెలిపారు. నగరంలోని అన్ని బేకరీలకు పదార్థాలు సరఫరా చేస్తున్న సంతోష్కుమార్ కిరాణం, జనరల్ స్టోర్లో తనిఖీలు చేసి సుమారు 196 రకాల పదార్థాలను సీజ్ చేసినట్లు తెలిపా రు. ఈ సందర్భంగా నిందితుడిపై కే సు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.