రాజేంద్రనగర్,(విజయక్రాంతి): ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఉస్మాన్సాగర్ (గండిపేట) జలాశయానికి వరద నీరు భారీగా చేరుతోంది. ఇప్పటికే జలాశయంలో నీరు గరిష్ట స్థాయికి చేరుకుంది, నేపథ్యంలో మంగళవారం(24.09.2024) రాత్రి 11.30 గంటలకు ఉస్మాన్సాగర్ రిజర్వాయర్ రెండు గేట్లను ఒక ఫీటు మేర ఎత్తి 234 క్యూసెక్కుల నీటిని మూసీ నదిలోకి నీటిని వదలడం జరుగుతోంది. ఈ సందర్భంగా మూసీ నది పరివాహక ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వివిధ శాఖల అధికారులకు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సూచించారు.