calender_icon.png 3 October, 2024 | 6:31 PM

మాజీ ఎమ్మెల్యే చిన్నయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

03-10-2024 03:28:24 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అరిజిన్ డైరీ సిఏఓ బోడపాటి శేజల్ ఎమ్మెల్యే గడ్డ వినోద్ కు వినతిపత్రం అందజేశారు. బెల్లంపల్లి కన్నాల ప్రాంతంలో ప్రభుత్వ భూమిని తన భూమిగా చూపించి ఆ రిజన్ డైరీ కి అమ్మారని పేర్కొంది. రూ కోటికి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయిస్తానని తమ నుండి చిన్నయ రూ 30 లక్షలు వసూలు చేసి రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బందులు పెట్టాడని పేర్కొంది. చిన్నయ్య పై అధికారులకు ఫిర్యాదు చేస్తే తమపైనే తప్పుడు కేసులు పెట్టించాడని ఎమ్మెల్యేకి అందించిన వినతి పత్రం లో బోడపాటి శేజల్ పేర్కొంది. ఆమె వెంట ఆరిజిన్ డైరీ ఎండి కందిమల్ల ఆదినారాయణ, సిబ్బంది వంశీకృష్ణ, రేఖా ప్రియదర్శిని ఉన్నారు.