calender_icon.png 22 September, 2024 | 11:59 AM

ఇథనాల్ ఫ్యాక్టరీపై అభిప్రాయాలు తీసుకోవాలి

22-09-2024 01:35:51 AM

పరిశ్రమ ప్రతినిధులతో కలెక్టర్..

నిర్మల్, సెప్టెంబర్ 21(విజయక్రాంతి): ది లువార్‌పూర్ గ్రామ సమీపంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు వల్ల కలిగే నష్టంపై విజయక్రాంతి దినపత్రికలో ఈ నెల 19న ‘పచ్చని పల్లెకు ఇథనాల్ మంట’ శీర్షికన ప్రచురితమైన కథనానికి కలెక్టర్ అభిలాష అభినవ్ స్పందించారు. శనివారం కలెక్టరేట్‌లో పరిశ్ర మ అధికారులు, ప్రతినిధులతో సమావేశమ య్యారు. పర్యావరణంతోపాటు రైతులకు ఎలాం టి నష్టం కులుగుతుందో శాస్త్రీయంగా అధ్యయనం చేసిన తర్వాతనే పనులపై నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. పరిశ్రమల అధికారులు రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్‌కమార్ పాల్గొన్నారు.