ఎల్బీనగర్,(విజయక్రాంతి): నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెంకు చెందిన నిమ్మనగొని నరసింహ(45) అనే వ్యక్తి ఛాతీలో నొప్పి రావడంతో అతని కుటుంబ సభ్యులు సోమవారం కొత్తపేటలోని ఓజోన్ ఆసుపత్రిలో చేరిపించారు. ఆరోగ్యశ్రీ ఆప్రోల్ కోసం రెండురోజులుగా నరసింహకు ఆసుపత్రి యాజమాన్యం చికిత్స చేయాలేదని మృతుడి బందువులు ఆరోపిస్తున్నారు. రెండు రోజుల తర్వాత ఆరోగ్యశ్రీకి ఈరోజు ఆప్రాల్ రావడంతో బుధవారం ఉదయం నరసింహకు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన కొద్దిగంటల్లోనే నరసింహ మృతిచెందడాన్ని ఆసుపత్రి వైద్యులు చెప్పినట్లు మృతిని బందువులు పేర్కొన్నారు. దీంతో మృతిని కుటుంబ సభ్యులు మరియు బందువులు తమకు న్యాయం చేయాలని ఆసుపత్రి ముందు బైఠాయించారు.