హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): శంషాబాద్లోని ‘సత్యం శివం సుందరం’ గో సేవా కేంద్రం వద్ద నిర్మించిన దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద వెటర్నరీ ఆసుపత్రిని ఆదివారం ప్రారంభించారు. దాతల సాయంతో దీన్ని 5,100 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ ఆసుపత్రిలో అంబులెన్స్, ఆపరేషన్ థియేటర్, ఇంటెన్సివ్ కేర్, డయాగ్నోస్టిక్ సదుపాయాలు, మెడికల్ డిస్పెన్సరీ మొదలయిన సౌకర్యాలు ఉన్నాయి. సత్యం శివం సుందరం పేరుతో హైదరాబాద్లోని ప్రముఖ ఆభరణాల వ్యాపారి ధరమ్ రాజ్ రాంఖా దాదాపు 6000 పశువలతో గోశాల నిర్వహిస్తున్నారు. గత 30ఏళ్లుగా ధరమ్ రాజ్ ఆవులను రక్షించే లక్ష్యంతో గోశాలను నిర్వహిస్తున్నారు.