calender_icon.png 16 October, 2024 | 3:55 PM

కొనుగోలు కేంద్రం ప్రారంభం

16-10-2024 11:42:12 AM

నిజాంసాగర్: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని మాగీ గ్రామంలో అచ్చంపేట సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రపు శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతులకు మద్దతు ధర కల్పించాలన్న లక్ష్యంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని రైతులు సద్వినియోగం చేసుకొని కొనుగోలు కేంద్రాలలోనే తమ ధాన్యాన్ని విక్రయించుకొని మద్దతు ధర పొందాలని ఆయన కోరారు. రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలును కొనసాగించాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో నాయకులు  గ్రామ పెద్దలు, బాల సాయిలు, రాజం గంగారం, జగన్, శేఖర్, తదితరులు ఉన్నారు.