ఆటపాటలతో సందడి చేసిన సినీతార శ్రీలీల
రాజేంద్రనగర్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): మాంగళ్య’ యాజమాన్యం నగరంలోని మణికొండలో ఏర్పాటు చేసిన 22వ స్టోర్ను ఆదివారం సినీతార శ్రీలీల జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆమె ఆటపాటలతో సందడి చేశారు. యువతీ, యువకుల కేరింతలతో ఉత్సాహ పరిచారు.
ఈ సందర్భంగా శ్రీలీల మాట్లాడుతూ.. అత్యాధునిక ఫ్యాషన్ కలెక్షన్స్తో నిత్య నూతన వెరైటీలతో మాంగళ్య స్టోర్ అందుబాటులోకి వచ్చిందన్నారు. స్టోర్లో ఫ్యాన్సీ, కంచి, ధర్మవరం, ఉప్పాడ పట్టు చీరెలు సరసమైన ధరలకు లభిస్తాయన్నారు. ఇక్కడ కిడ్స్, ఎత్నిక్ వేర్, మెన్స్ అండ్ ఉమెన్స్ వస్త్రాలు సరికొత్త వెరైటీల్లో ఉన్నాయన్నారు.
షాపింగ్ మాల్ డైరెక్టర్లు పీఎన్ మూర్తి, కాసం నమఃశివాయ, కాసం శివప్రసాద్, పుల్లూరు అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో మాంగళ్య షాపింగ్ మాల్స్ 12 ఏళ్ల నుంచి ప్రజల మన్ననలు పొందుతున్నాయన్నారు. ఇప్పటివరకు తాము 22 స్టోర్స్ ప్రారంభించినట్లు చెప్పారు. త్వరలోనే కర్నాటకలోనూ ప్రారంభిస్తామన్నారు.
తాము సొంత మగ్గాలపై చీరెలు నేయిస్తామన్నారు. ఈ కారణంగానే అతివలకు నాణ్యమైన వస్త్రాలను తక్కువ రేటుకు ఇవ్వగలుగుతున్నామన్నారు. కార్యక్రమంలో కాసం సాయికృష్ణ, కాసం ధీరజ్, డాక్టర్ కాసం ప్రీతం, తొడుపునూరి అరుణ్కుమార్, కార్తీక్, విశాల్, వరుణ్ పాల్గొన్నారు.