మందమర్రి (విజయక్రాంతి): పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా పట్టణ పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, కృష్ణవేణి పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భాగంగా పోలీసులు అందించే వివిధ సేవలను పట్టణ ఎస్సై రాజశేఖర్ విద్యార్థులకు వివరించారు. పోలీస్ స్టేషన్ లోని రిసెప్షన్ వ్యవస్థ, కేసు డైరీలు, హిస్టరీ షీట్స్,స్టేషన్ లాకప్, స్టేషన్ లో ఉపయోగించే ఆయుధాలు, డయల్ 100 వ్యవస్థ పనిచేయు విధానం, పోలీసుల ముఖ్య విధులు, పోలీస్ యూనిఫాం, ట్రాఫిక్ రూల్స్, నూతన చట్టాలు ఇతర అంశాలపైన విద్యార్థులకు అవగాహన కల్పించారు. అంతే కాకుండా పోలీసులు రోజువారి విధుల్లో అత్యంత కీలకంగా వ్యవహరించే కమ్యూనికేషన్ విధానం వివరించి విద్యార్థులచే పోలీస్ కంట్రోల్ రూమ్ చేత మాట్లాడించారు. ఈ సందర్బంగా విద్యార్థులు పోలీసు వ్యవస్థపై ఆసక్తి వ్యక్తపరిచడమే కాకుండా పోలీస్ వ్యవస్థ యొక్క పనితీరు గురించి తెలుసుకొని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.