నిజాంసాగర్: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా శుక్రవారం కామారెడ్డి జిల్లా బిచ్కుంద పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు వెపన్స్ (ఆయుధాల పని తీరుపై) వివరించడం జరిగింది. దీంతో పాటుగానే పోలీస్ సిబ్బంది విధులు, ఆత్యవస పరిస్థితుల్లో డయల్ 100 వినియోగించుకోవడం అన్న అంశంపై ఎస్సై మోహన్ రెడ్డి విద్యార్థులకు వివరించారు. అనంతరం పాఠశాలలో వ్యాసరచన పోటీలను నిర్వహించారు. పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది ఉపాధ్యాయులు ఉన్నారు.