11-03-2025 12:53:18 AM
అన్ని రకాల ఉద్యోగ నియామకాలు చేపట్టాలి
ఆర్మూర్, మార్చి 10 (విజయక్రాంతి) : ఆర్మూర్లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎస్సీల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన తరువాతనే అన్ని ఉద్యోగ నియామకాలను చేపట్టాలని ఎమ్మార్వో కార్యాలయం ముందు రిలే దీక్షలు ప్రారంభించడం జరిగింది.ఈ దీక్ష కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి మైలారం బాలు మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్ట భద్దత కల్పించకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలను విడుదల చేయడం ఆపాలని, అసెంబ్లీలో సీఎం మాదిగలకు ఇచ్చిన హామీ ప్రకారం అన్ని నియామకాల్లో వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శ్యామ్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మైలారం రాము మాదిగ, మాదిగ మహసేన ఆర్మూర్ నియోజవర్గ అధ్యక్షులు చంద్రశేఖర్, ఎంఎస్ పి నాయకులు మార్కు, ప్రదీప్, మండల ప్రధాన కార్యదర్శి సంతోష్, ఎమ్మార్పీఎస్ నాయకులు విప్లవ్, సంతోష్, సునీల్, తరుణ్, బన్నీ, అజయ్, దిలీప్ పాల్గొన్నారు.