17-03-2025 01:29:29 AM
గ్రీన్ ఫార్మాసిటీ సీఐ కృష్ణంరాజు
యాచారం, మార్చి 16: ఆన్ లైన్ గేమింగ్, డ్రగ్స్, చెడు వ్యసనాలకు యువత, విద్యార్థు లు దూరంగా ఉండాలని గ్రీన్ ఫార్మాసిటీ సీఐ కృష్ణంరాజు సూచించారు. బుధవారం మండల పరిధిలో మేడిపల్లి గ్రామంలో ఆన్లైన్ గేమింగ్,డ్రగ్స్, పేకాటతో పాటు చెడు వ్యాసనలపై యువత. విద్యార్థు లు. ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
అన్ లైన్ గేమ్స్ వ్యసనంగా మారి ఎంతో మంది యువత, విద్యార్థులు ఆర్థికంగా నష్టం చేకూ ర్చడంతో పాటు ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నా యని అన్నారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తుపదార్థాలను తీసుకుంటూ యువత పెడదారి పడుతున్నారని, నేరాలకు పాల్పడుతున్నార ని చెప్పారు.
విద్యార్థులు, యువత ఎప్పుడు వాటికి దూరంగా ఉండాలని సూచించారు. పిల్లలను నిరంతరం గమనిస్తూ ఉంటూ, వారికి సాధ్యమైనంత వరకు ఫోన్ ఇవ్వకూదదని తల్లిదండ్రులకు సీఐ సూచించారు. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమ త్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ గ్రీన్ ఫార్మసీటీ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.