calender_icon.png 5 October, 2024 | 11:05 PM

ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి

05-10-2024 12:06:46 AM

చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి 

రాజేంద్రనగర్, అక్టోబర్ 4: అందరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. మణికొండ మున్సిపాలిటీ పరిధి నెక్నంపూర్ వెంకటేశ్వర కాలనీలోని గాయత్రి మాత ఆలయంలో ప్రతిష్ఠించిన అమ్మవారిని స్థానిక మున్సిపల్ వైస్ చైర్మన్ నరేందర్‌రెడ్డి, ఆలయ చైర్మన్ ఉపేంద్రనాథ్‌రెడ్డితో కలిసి శుక్రవారం ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.