25-03-2025 05:11:10 PM
జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వర్ రావు..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): దేశ రక్షణలో భాగంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిర్వహించేందుకు బిజెపి పార్టీ కంకణం కట్టుకుందని జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం పెంచికల్ పేట్ మండలంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి భాజపా జిల్లా అధ్యక్షుడు ధోనీ శ్రీశైలంతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... లోక్ సభ, అసెంబ్లీ ,స్థానిక సంస్థల ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం ద్వారా ఆర్థిక భారం తగ్గుతుందనీ, పరిపాలన సామర్థ్యాన్ని పెంచడమే ప్రధాన లక్ష్యం అన్నారు. జమిలి ఎన్నికలకు నిర్వహణ కోసం క్యాబినెట్ లో ఆమోదం తెలపడంతో పాటు పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టడం జరిగిందని వివరించారు. క్షేత్రస్థాయిలో ఒకే దేశం ఒకే ఎన్నిక నినాదాన్ని తీసుకువెళ్లేందుకు ప్రతిఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో కన్వినర్ వీరభద్ర చారి, నాయకులు ప్రసాద్ గౌడ్, గడ్డల కరణ్, సత్యనారాయణ, నానయ్య, నారాయణ, ప్రభాకర్, నాగేష్, పురుషోత్తం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.