12-02-2025 12:00:00 AM
బాన్సువాడ, ఫిబ్రవరి 11 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం లోని నస్రుల్లాబాద్ శివారులోని అటవీ ప్రాంతంలో ప్రధాన రహదారిపై ఓ కారు బోల్తా పడింది. మంగళ వారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. బాన్సువాడకు చెందిన కీర్తి వెంకటేష్ కారులో నిజామాబాద్ వైపు వెళ్తుండగా ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ఘటనలో వెంకటేష్కు గాయాల య్యాయి. స్థానికులు బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు నిజామాబాద్ రిఫర్ చేశారు.