దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన అధికారులు
కూసుమంచి , అక్టోబర్ 3: కూ సుమంచి మండలంలో బుధవారం గాలివానకు పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది. పాలేరు, గైగోళ్లపల్లి, గురవాయిగూడెం గ్రామాల్లో 100 ఎకరాల్లో పంట నేలకొరిగింది. గత నెలలో కురిసిన వర్షాలకు భారీగా నష్టపోయిన రైతులను గాలివాన మరింత కష్టాలపాలు చేసింది. పొట్ట దశలో ఉన్న వరి నేలపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గురువాయిగూడెంకు చెందిన బొల్లంపల్లి సుధాకర్రెడ్డికి చెందిన 20 ఎకరాలు, బొల్లంపల్లి వీరారెడ్డి, వెంకటరెడ్డిలకు చెందిన వరి దెబ్బతిన్నది. గాలివానకు దెబ్బతిన్న పంట పొలాలను మండల వ్యవసాయ అధికారి వాణి గురువారం పరిశీలించారు. పంట నష్టం అంచనా వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు.