14-02-2025 12:49:57 AM
తాడ్వాయి, ఫిబ్రవరి, 13( విజయ క్రాంతి ): ఇంటి గోడ నిర్మాణ పనులు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు గోడ కూలిన సంఘటనలో ఒకరు మృతి చెందారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమి కలాన్ లో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.
గోడ నిర్మాణం చేపడుతున్న సమయంలో గోడ కూలిన ప్రమాదంలో గ్రామానికి చెందిన బెస్త నారాయణ (50) అనే వ్యక్తి మృతి చెందారు. గ్రామంలో ఇద్దరు గోడ పనులు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా గోడ కూలింది.
ఈ ప్రమాదంలో నారాయణను తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన నారాయణను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు మృతుడికి భార్య పిల్లలు ఉన్నారు నారాయణ మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.