18-04-2025 01:40:55 AM
యాదాద్రి భువనగిరి ఏప్రిల్ 17 ( విజయ క్రాంతి ): జిల్లాలలోని వైద్య అధికారులకి మరియు యం.యల్.యచ్.పి లకు అసంక్రమిత వ్యాధులు, వడదెబ్బ, రేబిస్ వ్యాధి పై ఒకరోజు ఒరియంటేషణ్ శిక్షణా కార్యక్రమము మెడికల్ ఆఫీసర్స్, ఎమ్మెల్యే హెచ్ పి లకు నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా వైద్యాధికారి డాక్టర్ మనోహర్ మాట్లాడుతూ ఉప్పు, చక్కెర,అన్నము ఎక్కువ సార్లు తీసుకోవడం వల్ల హైపర్ టెన్షన్, మధుమోహ వ్యాధులు వ్యాపిస్తున్నాయని అన్నారు ఆహారం తీసుకునేటప్పుడు ఉప్పును తగ్గించడం,తీపి పదార్థాలను తగ్గించడం అలవాటు చేసుకోవాలన్నారు.
కార్యక్రమంలో డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ లు. డాక్టర్.శిల్పిని అలాగే ప్రోగ్రాం ఆఫీసర్స్. రామకృష్ణ పి ఓ సి హెచ్ సాయి శోభ, టీవీ, లెప్రసీ వీణ , ఇస్తారి,మరియమ్మ తదితరులు పాల్గొన్నారు.