calender_icon.png 7 October, 2024 | 2:53 AM

33 ఏళ్ల తర్వాత మరోసారి!

07-10-2024 12:08:21 AM

సూపర్ స్టార్ రజనీకాంత్, ప్రముఖ దర్శకుడు మణిరత్నం కలయికలో ఓ చిత్రం రాబోతోందా? అంటే, తమిళ సినిమా వర్గాల నుంచి ఔననే సమాధానమే వస్తోంది. రజనీ కాంబో చిత్రం గురించిన వార్తే ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్ హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. తమిళ చిత్రసీమకు చెందిన ఈ దిగ్గజ ద్వయం చాలా ఏళ్ల తర్వాత మళ్లీ సినిమా చేయబోతున్నారు.

మణిరత్నం కాంబో దాదాపు ఖరారైందని, డిసెంబర్ 12న రజనీ పుట్టినరోజున ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించనున్నారు. రజనీని ఇప్పటివరకు ఎవరినీ చూపించనివిధంగా ఓ ప్రాజెక్టును మణిరత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా సిద్ధం చేస్తున్నారట. ఇదే నిజమని తేలితే, రాబోయే ప్రాజెక్టు వీరి కలయికలో రెండోది అవుతుంది. రజనీ కాంబోలో 33 ఏళ్ల క్రితం విడుదలైన ఐకానిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘దలపతి’ విడుదలైంది.

ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వెలువడితే మాత్రం అభిమానుల ఆనందానికి హద్దు ఉండదని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. మణిరత్నం ప్రస్తుతం అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘థగ్‌లైఫ్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ చిత్రం ప్రముఖ నటుడు కమల్‌హాసన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దాదాపు 37 సంవత్సరాల తర్వాత మణిరత్నం కమల్‌హాసన్‌తో చేతులు కలిపారు.