ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన బుర్రా వెంకటేశం
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 7 (విజయక్రాంతి): ఇటీవల విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన వారికి ఈ నెల 9న సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందజేయనున్నారు. నగరంలోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను సోమవారం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, విద్యుత్ శాఖ ఎండీ ముషారఫ్ అలీ, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఆర్అండ్బీ కార్యదర్శి హరిచందన, అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్, ఏసీపీ ట్రాఫిక్ విశ్వప్రసాద్, సీఎం సెక్యూరిటీ సిబ్బంది పరిశీలించారు. వెంకటేశం మాట్లాడుతూ.. నిర్ధేశిత సమయానికి పనులు పూర్తి చేయాలని వివిధ శాఖల అధికారులకు సూచించారు.