దివంగత నటుడు అక్కినేని నాగేశ్వర రావు శత జయంతోత్సవాల ముఖ్య ఘట్టానికి వేళయింది. ఏఎన్నార్ పేరిట ఇచ్చే అవార్డు వేడుక ఈనెల 28న నిర్వహిం చనున్నారు. హైదరాబాద్ వేదికగా జరగ నున్న ఈ అవార్డు ప్రదానోత్సవానికి బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఆయన చేతులమీదుగా మెగాస్టార్ చిరంజీవికి అవార్డు ప్రదానం చేయను న్నారు.
ఈ విషయాన్ని సెప్టెంబర్ 20న జరిగిన ఏఎన్నార్ శత జయంతి వేడుకలోనే అక్కినేని కుటుంబీకులు ప్రకటించారు. అక్టోబర్ 28న నిర్వహించే ఈ అవార్డు ప్రదానోత్సవానికి సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో వేడుకకు ఆహ్వానించేందుకు నాగార్జున శుక్రవారం చిరంజీవిని కలిశారు.