యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 19 (విజయక్రాంతి) : జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ శనివారం భువనగిరిలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్దళ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నా సీఎం రేవంత్రెడ్డి, దేవాదాయ మంత్రి కొండా సురేఖ స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.