calender_icon.png 21 October, 2024 | 4:02 PM

చిరు బర్త్‌డే రోజున..

24-07-2024 12:00:00 AM

బీఎస్‌కే మెయిన్ స్ట్రీమ్ పతాకంపై బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘పరాక్రమం’. శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ ఇతర పాత్రధారులుగా నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 22న థియేటర్లలోకి రానుంది. ఈమేరకు హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయ సమావేశంలో  బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ “మా సినిమాను చిరంజీవి బర్త్ డే రోజున విడుదల చేస్తున్నాం. నన్ను ఎంతో ఇన్స్‌పైర్ చేసిన చిరంజీవిని శివుడిలా భావిస్తా. గతం లో ‘నిర్భందం’, ‘నిర్భందం 2’, ‘మాంగళ్యం’ అనే సినిమాలు రూపొందించాను. అవి డిజిటల్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఫీచ ర్ ఫిల్మ్ చేయాలన్న ప్రయత్నంలో చేసిన ఈ ‘పరాక్రమం’ అన్ని వర్గాల ప్రేక్షకులు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు” అన్నారు.