ముత్తారం,(విజయక్రాంతి): పెద్దపెల్లి జిల్లా ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి మానేరు నది ఒడ్డున గుర్తు తెలియని వృద్ధురాలి మహిళా మృతదేహం గురువారం తెల్ల జామున గ్రామస్తులకు కనిపించింది. దీంతో గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై నరేష్ ఈ మృతదేహం ఎక్కడి నుంచి వచ్చింది ఈ వృద్ధురాలు ఆధారాలు సేకరిస్తూ మానేరులోకి ఎలా వచ్చింది. అనే కోణంపై విచారణ చేపట్టారు.