calender_icon.png 20 September, 2024 | 6:33 AM

నందిమేడారంలో రెండు మోటార్లు ఆన్ చేసిన అధికారులు

27-07-2024 04:49:55 PM

నంది మేడారం: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని నంది మేడారం పంప్ హౌస్ లో రెండు పంపులను అధికారులు శనివారం ఆన్ చేశారు. నందిమేడారంలో 4,6వ మోటర్లు ఆన్ చేసిన అధికారులు సాయంత్రం వరకు 3 పంపులు ఆన్ చేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. రెండు పంపుల  ద్వారా మేడారం రిజర్వాయర్ లోకి కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని  తరలిస్తున్నారు. గాయత్రి పంప్ హౌస్ కు 3,120 క్యూసెక్కుల నీరు ఎత్తుపోతలు జరుగుతున్నాయని, గాయత్రి పప్ హౌస్ నుంచి మిడ్ మానేరు కు జలాలు తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.