05-03-2025 09:06:43 PM
మొగుడంపల్లి/సంగారెడ్డి (విజయక్రాంతి): జహీరాబాద్ నియోజకవర్గంలో ఉన్న మొగుడంపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో సాగుకు పనికిరాని భూములను అధికారులు బుధవారం పరిశీలించారు. భూముల భూ పరిష్కారాలకు మార్గాలు చూపెట్టాలని అధికారుల సూచించారు. ఈ సందర్బంగా ఆర్డీవో రామిరెడ్డి, తహశీల్దార్ హసీనా బేగం భూముల సాగు అవకాశాల పెంపుపై సంబంధిత అధికారులతో చర్చించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి, భూసమస్యల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ సాయికిరణ్, అగ్రికల్చర్ అధికారి సరస్వతి, రెవిన్యూ సిబ్బంది ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు.