calender_icon.png 30 September, 2024 | 7:04 PM

ప్రభుత్వ భూముల రక్షణలో అధికారులు విఫలం

30-09-2024 05:00:55 PM

నారాయణరావుపేట మండలం అఖిలపక్ష ఆధ్వర్యంలో తహసిల్దార్ కి వినతి పత్రం

సిద్దిపేట (విజయక్రాంతి): ప్రభుత్వ భూములు కాపాడడంలో రెవెన్యూ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని నారాయణరావుపేట మండలం అఖిలపక్షం నాయకులు విమర్శించారు. ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నా వారిపై కేసులు నమోదు చేసి భూములను స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ అధికారులను కోరుతూ సోమవారం స్థానిక తహసిల్దార్ కు అట్లపక్ష ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. పది రోజుల లో ప్రభుత్వ భూములను సర్వే చేసి ప్రభుత్వం స్వాధీనపరచుకోవాలని లేనియెడల పెద్దఎత్తున నిరసన చేపడతామని ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు, జిల్లెల్ల రమేష్ గౌడ్, పొన్నాల బాబు, కొంనాయ్యగారి  ఎల్లయ్య, కొంగరి దేవరాజు, భాగన్న కరుణాకర్, బిట్ల శ్రీనివాస్, బొంగరపు రాజిరెడ్డి, పిట్ల భూమయ్య, నవీన్ గౌడ్,  స్వామి, రాము, బిక్షపతి, మహేష్ గౌడ్, సుధాకర్, బండి రంజిత్, అభి, తదితరులు పాల్గొన్నారు.