calender_icon.png 15 October, 2024 | 5:54 PM

క్షేత్రస్థాయిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలిస్తున్న అధికారులు

15-10-2024 03:20:57 PM

నిజాంసాగర్: కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో మంగళవారం ఎల్ఆర్ఎస్ కు సంబంధించిన ప్లాట్లను భూములను క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి క్షేత్రస్థాయిలో సిబ్బందితో కలిసి పరిశీలించారు. గతంలో ఎల్ఆర్ఎస్ చేసుకున్న లబ్ధిదారుల యొక్క ప్లాట్లను నివాస గృహాలను ఆమె పరిశీలించారు. ఆమె వెంట తహసిల్దార్ వేణుగోపాల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.