calender_icon.png 24 October, 2024 | 7:50 PM

అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు అధికారుల యత్నం

24-10-2024 01:43:19 AM

  1. అడ్డుకున్న యజమానులు
  2. కేసు నమోదు

రాజేంద్రనగర్, అక్టోబర్ 23: ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుం టామని రాజేంద్రనగర్ తహసీల్దార్ బొమ్మల రాములు హెచ్చరించారు. మైలార్‌దేవ్‌పల్లిలోని టీఎన్‌జీవో కాలనీ సర్వేనంబర్ 156/1లో ఉన్న సుమారు 1000 గజాల ప్రభుత్వ స్థలానికి గతంలో శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి నకిలీ పత్రాలు సృష్టించి కొన్ని ప్లాట్లను విక్రయించి సొమ్ము చేసుకున్నాడు.

కొందరు సదరు స్థలంలో నిర్మాణాలు చేపట్టారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. బుధవారం తహసీల్దార్ రాములు ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలను జేసీబీతో కూల్చడానికి ఉపక్రమించారు. అక్కడ నివాసం ఉంటున్న రవీందర్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబీకులు జేసీబీపైకి రాళ్లు రువ్వారు.

అధికారులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జేసీబీపైకి రాళ్లు రువ్వడంతో అద్దాలు పగిలిపోయాయి. రెవెన్యూ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు రవీందర్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబీకులపై కేసు నమోదు చేశారు.