07-04-2025 04:54:31 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని కన్నాల శ్రీ బుగ్గ రాజా రాజేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం హనుమాన్ స్వాములకు బుగ్గ గూడెం గ్రామానికి చెందిన దాత ప్రణయ్ కుటుంబ సభ్యులు భిక్ష ఏర్పాటు చేశారు. ముందుగా బుగ్గ దేవాలయం ప్రాంతంలోని హనుమాన్ మందిర్ లో హనుమాన్ స్వాములు ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆంజనేయునికి నైవేద్యం సమర్పించి బిక్షలో పాల్గొన్నారు.