calender_icon.png 11 October, 2024 | 8:46 PM

కంగారూలదే వన్డే సిరీస్

01-10-2024 12:00:00 AM

ఐదో వన్డేలో ఇంగ్లండ్‌పై విజయం

బ్రిస్టల్: ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-2 తో కైవసం చేసుకుంది. ఆదివారం రాత్రి జరిగిన చివరి వన్డేలో ఆస్ట్రేలియా డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 49 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయాన్ని అందుకుంది. 310 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆసీస్ వర్షం అంతరాయం కలిగించే సమయానికి 20.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.

వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో ఆటను నిలిపివేసిన అంపైర్లు రన్‌రేట్ ప్రకారం ఆసీస్ చేయాల్సిన దానికంటే ఎక్కువ పరుగులు చేయడంతో విజేతగా ప్రకటించారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 309 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ బెన్ డకెట్ (107) సెంచరీతో రాణించగా.. కెప్టెన్ బ్రూక్ (72) ఆకట్టుకున్నాడు. 4 వికెట్లు పడగొట్టిన హెడ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’తో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు దక్కింది.