ఇంట్లోనే తవ్వకాలు
పోలీసుల అదుపులో ఇద్దరు
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురంలో గుప్త నిధుల కోసం జరిపిన క్షుద్ర పూజలు, తవ్వకాలు కలకలం సృష్టించాయి. అశ్వారావుపేట ఎస్హెచ్ఓ రాజు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అనం త శేషయ్య కొన్నిరోజుల క్రితం ఊరికి వెళ్తూ.. తన మేనత్త అయిన జంగారెడ్డిగూడానికి చెందిన రోజారాణికి ఇంటి తాళాలు ఇచ్చి వెళ్లాడు.
ఆమె హైదరాబాద్కు చెందిన కొందరిని పిలిపించి శేషయ్య ఇంట్లో గుప్త నిధుల కోసం పూజలు నిర్వహించింది. శేషయ్యకు రోజారాణి పలు మార్లు ఫోన్చేసి ఎప్పుడు వస్తున్నావని అడగడంతో ఆదివారం మధ్యా హ్నం వరకు వస్తానని చెప్పాడు. ఇం ట్లో హోమం చేయిస్తున్నాని రావొద్దని చెప్పింది. శేషయ్యకు అనుమా నం వచ్చి తన స్నేహితులకు ఫోన్ చేసి ఇంటికి పంపించాడు.
వారు వెళ్లి చూడగా ఇంట్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపినట్టు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీ సులు ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, ముగ్గురు పరారైనట్టు తెలిసింది. అరెస్టయిన వారిలో హైదరాబాద్కు చెందిన వాసంశెట్టి సురేష్, సునీల్ ఉన్నారు. కారును స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.