calender_icon.png 2 April, 2025 | 7:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

3న నర్సరీ పండ్ల తోటల వేలం..

31-03-2025 05:36:28 PM

కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ (విజయక్రాంతి): కాగజ్ నగర్ మండలంలోని జంబుగా ఉద్యాన నర్సరీ మామిడి పండ్ల తోటల వేలం ఏప్రిల్ 3న నిర్వహించనున్నట్లు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి శ్రీమతి కుష్బూ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. జంబుగా తోటలో బంగినపల్లి, దశేరి తోతాపురి, రసాలు, హిమాయత్, లాంగ్ర వంటి మామిడి హైబ్రిడ్ రకాలు ఉన్నాయని తెలిపారు. వేలంపాటలో మూడు సంవత్సరాలకు కలిపి (2025, 2026, 2027) పంట కాలానికి ఈ పండ్ల తోటల వేలం జరుగుతున్నట్లు తెలిపారు. ఎవరికైతే తోట దక్కుతుందో మూడు సంవత్సరాల పాటు వారే పూర్తి స్థాయిలో ఎరువులు వేయటం, సస్యరక్షణ చర్యలు చేపట్టటం వంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలని స్పష్టం చేశారు.

ఆసక్తి కలిగిన వ్యాపారస్తులు రూ.10,000/- (పదివేల రూపాయలు) ధారావత్తు సొమ్ముతో ఏప్రిల్ 3వ తేదీన ఉదయం 11.00 గంటలకు జంబుగా ఉద్యాన నర్సరీలో జరిగే బహిరంగ వేలంలో పాల్గొనాలని ప్రాజెక్ట్ అధికారి సూచించారు. వేలంలో తోటను దక్కించుకున్నవారు సగం సొమ్మును వెంటనే చెల్లించాలి అని, మిగతా సొమ్మును వారం రోజుల్లో చెల్లించాలని సూచించారు. మొత్తం సొమ్ము చెల్లించిన తర్వాతనే కాయలు కోయటానికి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు ఐటిడిఏ ప్రాజెక్టు ఉద్యాన అధికారి లేదా సంబంధిత నర్సరీ సాంకేతిక అధికారులను ఫోన్ నంబర్లలో (8897478825, 9441020755) సంప్రదించాలని పేర్కొన్నారు.