ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్
దుబాయ్: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ ర్యాంకింగ్స్లో సత్తా చాటాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్లో బుమ్రా (870 పాయింట్లు) తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. బంగ్లాతో జరిగిన టెస్టు సిరీస్లో అదరగొట్టిన బుమ్రా మొత్తంగా 11 వికెట్లు పడగొట్టాడు. ఇంతకు ముందు తొలి స్థానంలో ఉన్న టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (869 పాయింట్లు) రెండో స్థానంలో నిలిచాడు.
భారత్ నుంచి జడేజా (809 పాయింట్లు) ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. బ్యాటింగ్ విభాగంలో కాన్పూర్ టెస్టులో రెండు ఇన్నింగ్సుల్లోనూ అర్ధ సెంచరీలతో చెలరేగిన బ్యాటింగ్ సంచలనం యశస్వి జైస్వాల్ (792 పాయింట్లు) మూడో ర్యాంకుకు చేరుకున్నాడు. చాలా కాలం తర్వాత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (724 పాయింట్లు) ఆరు స్థానాలు ఎగబాకి టాప్హా చోటు దక్కించుకున్నాడు.
పంత్ మూడు స్థానాలు దిగజారి 9వ ప్లేసులో కొనసాగుతున్నాడు. గిల్, రోహిత్ శర్మ 15, 16వ స్థానాల్లో కొనసాగుతున్నారు. ఆల్రౌండర్ల కేటగిరీలో రవీంద్ర జడేజా (468 పాయింట్లు) తొలి స్థానాన్ని కాపాడుకోగా.. అశ్విన్ రెండు, అక్షర్ పటేల్ తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నారు.