calender_icon.png 20 September, 2024 | 7:10 PM

నృసింహుని హుండీ ఆదాయం రూ.2.98 కోట్లు

19-09-2024 12:38:38 AM

యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసిం హస్వామి ఆలయ సన్నిధిలో బుధవారం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో సిబ్బంది ఆలయ హుండీ ఆదాయాన్ని లెక్కించారు. హుండీ ద్వారా స్వామివారికి రూ.2.98 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి భాస్కర్‌రావు తెలిపారు. అలాగే భక్తులు 205 గ్రాముల బంగారం, ఐదు కిలోల 710 గ్రాముల వెండి సమర్పించారన్నారు. ఇవి కాక హుండీలో 1,261 అమెరికా డాలర్లు, 125 ఆస్ట్రేలియా డాలర్లు, 65 ఇంగ్లాండ్ పౌండ్స్, 210 యూఏఈ దీరమ్స్, 730 నేపాల్ రూపీ, 537 సైదీ అరేబియా రియల్స్, 60 సింగపూర్ డాలర్లు, మూడు కతర్ రియల్స్, 100 ఓమన్ బైస, 1,000 శ్రీలంక రూపీస్, 60 కెనడా డాలర్లు, 125 యూరప్ యూరోస్, 20 థాయ్‌లాండ్ బట్స్, 50 రష్యారూబేల్స్, ఒక ఓమెన్ రియల్, 22 మలేసియా రింగిట్స్ హుండీలో కానుకలుగా వచ్చాయన్నారు.