25-03-2025 12:24:33 AM
మెదక్, మార్చి 24 (విజయక్రాంతి): ఉగాది పండగ పురస్కరించుకొని రాష్ట్ర ప్రభు త్వం పేదలకు తీపి కబురు అందించింది. ఆహారభద్రత కార్డుదారులకు ఏప్రిల్ 1 నుంచి సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం డీలర్ల వద్ద నిల్వ ఉన్న దొడ్డుబియ్యం మొత్తం వెనక్కి పంపిస్తారా లేదా అనేది ఇంకా తేలాల్సి ఉంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో సన్నబియ్యం కొనుగోలు చేయలేని పేదలకు ప్రయోజనం చేకూరనుం ది. అలాగే అక్రమంగా సాగుతున్న రేషన్ బియ్యం దందాకు చెక్పడే అవకాశముంది.
అక్రమ దందాకు చెక్...
ఆహారభద్రత కార్డుదారులకు ప్రభుత్వం చౌకధరల దుకాణాల ద్వారా ఒక్కో వ్యక్తికి ఆరు కిలోల చొప్పున బియ్యం అందజేస్తోం ది. ఇవి దొడ్డువి కావడంతో చాలా మంది వీటిని తినడానికి ఇష్టపడడం లేదు. అలాంటి వారు తమకు రావాల్సిన కోటా బియ్యంను డీలర్లకే కిలో రూ.13 నుంచి రూ.15 వరకు విక్రయిస్తున్నారు. ఇలా కొనుగోలు చేసిన బియ్యంను డీలర్లు వ్యాపా రులకురూ.20 నుంచి రూ.22 చొప్పున విక్రయిస్తున్నారు.
మరి కొంతమంది బియ్యంను నెలల తరబడి నిల్వ చేసి తమ ఇంటి వద్దకు ఆటోలతో వచ్చే వారికి అమ్ముతున్నారు. పేదలకు అందాల్సిన ఈ రేషన్ బియ్యంను దళారులు, వ్యాపారులు కలిసి ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసు కుంటున్నారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపంతో ఈ దందా యథేచ్ఛగా సాగుతూ వస్తోంది. తాజాగా సన్నబియ్యం పంపిణీ ద్వారా ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట పడనుందనే అభిప్రాయం వ్యక్త మవుతోంది.
నాణ్యతపై అనుమానాలు...
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సన్నబియ్యం అందించే ప్రయత్నం చేసినప్పటికీ నాణ్యత కొరవడింది. రెండు, మూడు నెలల పాటు సరఫరా చేయగా అందులో నూకలు, తౌడు రావడంతో పేదలు వాటిని తినకుండా వ్యాపారులకు విక్రయించారు. ఈ క్రమంలో ప్రస్తుత ప్రభుత్వం పంపిణీ చేయనున్న బియ్యం నాణ్యతపై కార్డుదారుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రభుత్వం సన్నవడ్లకు రూ.500 బోనస్ అందజేసి కొనుగోలు చేయడంతో నాణ్యమైన బియ్యం వచ్చే అవకాశముందనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. దీంతో పేదలకు మేలు చేకూర నుంది.
కొత్త కార్డుదారులకు ప్రశ్నార్థకే..?
సర్కారు నిర్ణయంపై ఆహారభద్రత కార్డుదారుల్లో ఆనందం వ్యక్తమవుతుండగా కొత్తకార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి మాత్రం నిరాశే మిగులుతుంది. కొత్త కార్డుల జారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం మెదక్ జిల్లాలో మాత్రం పైలట్ ప్రాజెక్టుగా గ్రామాలను ఎంపిక చేయలేదు. దీంతో దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త కార్డులు రాలేక పోయాయి. కాగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో ఆ ప్రక్రియను బ్రేక్ పడింది. కార్డులు రాకపోవడంతో వారికి సన్నబి య్యం పొందే అవకాశం లేకుండా పోతుంది.
పంపిణీకి చర్యలు...
సురేష్, జిల్లా పౌరసరఫరాల అధికారి
పేదలకు సన్నబియ్యం అందించే దిశగా అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. ప్రస్తుతం రేషన్ దుకాణాల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యం వెనక్కు తీసుకోవాలని ఎలాంటి ఆదేశాలు రాలేదు. జిల్లాకు కేటాయించిన సన్న బి య్యం కోటాను ఎంఎల్ఎస్ పాయింట్లకు సరఫరా చేసేలా చర్యలు చేపడుతున్నాం. ఏప్రిల్ 1 నుంచి లబ్దిదారులకు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాం.