calender_icon.png 27 September, 2024 | 3:13 AM

హోటల్ తాజ్‌మహల్‌కు నోటీసులు

26-09-2024 01:46:53 AM

 పప్పులో జెర్రీ ఘటనకు ఫుడ్‌సేఫ్టీ అధికారుల స్పందన

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): అబిడ్స్‌లోని తాజ్‌మహల్ హోటల్‌లో ఓ వినియోగదారుడు  పప్పు ఆర్డర్ చేయగా, డిష్‌లో జెర్రీ కనిపించింది. ఈ ఘటనపై జీహెచ్‌ఎంసీ, ఫుడ్ సెఫ్టీ అధికారులు స్పందించారు. బుధవారం హోటల్ ను తనిఖీ చేశారు. పరిశుభ్రత లోపం, నాణ్యత  లేని ఆహార పదార్థాలు, ఐటమ్స్‌పై లేబుళ్లు లేకపోవడం, నిల్వ చేసే ప్రదేశంలో బొద్దింకలు ఉండటాన్ని గమనించి యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు.