హైదరాబాద్: ప్రముఖ రచయిత్రి బోయి విజయభారతి కన్నుమూశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం ఉదయం విజయభారతి తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బారిన పడిన ఆమె సనత్ నగర్ రెనోవా ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. విజయ భారతి బోయి భీమన్న కుమారై, బుజ్జా తారకం సతీమణి. ఐఏఎస్ బుజ్జా రాహుల్ కు తల్లి విజయభారతి. తెలుగు అకాడమీ డైరెక్టర్ గా విజయభారతి తనదైన ముద్ర వేశారు. ఆమె మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.