calender_icon.png 27 September, 2024 | 4:50 AM

విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

26-09-2024 08:35:06 PM

కోదాడ,(విజయక్రాంతి): తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయుల సంఘం సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం కోదాడ నియోజకవర్గంలోని కోదాడ, అనంతగిరి, చిలుకూరు మండలాల్లోని బాలాజీనగర్, శాంతినగర్, గోండ్రియాల, నారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ టెస్ట్ వ్రాసే విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు. దీనిలో  క్వాలిఫై అయిన విద్యార్థులకి కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 12000 రూపాయలు 4 సంవత్సరంలు అందిస్తున్నది. ఇది పేద విద్యార్థులకి ఎంతో ఉపయోగం, విద్యార్థుల ప్రతిభ పాటవలు వెలికి తీయటం జరుగుతుందని, ఉపాధ్యాయుల సభ్యత్వ నమోదు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు సంధ్యారాణి, ఫణి కుమార్, శ్రీనివాస్ రావు, సుధాకర్, తెలంగాణ  మోడల్ స్కూల్స్ రాష్ట్ర బాధ్యులు రామకృష్ణ పాల్గొన్నారు.