అత్తపై దాడి
సూర్యాపేట, అక్టోబర్ 28: భార్య ను కాపురానికి పంపడం లేదని అత్త పై అల్లుడు దాడి చేసిన ఘటన నేరేడుచర్లలో జరిగింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలకవీడు మండలం చెరువు తండాకు చెం దిన యువతిని తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితం నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం మాటూరు గ్రామానికి చెం దిన నాగేశ్వరరావుకు ఇచ్చి వివాహం చేశారు.
భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా కొద్దిరోజుల క్రితం భార్య పుట్టింటికి వచ్చింది. దీంతో సోమవారం నాగేశ్వరరావు చెరువుతండా కు వెళ్లాడు. తన భార్య కాపురానికి రా కపోవడానికి కారణం అత్త అని భా వించిన నాగేశ్వరరావు ఆమెపై పానర్తో దాడికి పాల్పడ్డాడు. ఘటనలో ఆమె తీవ్రగాయాల పాలైంది. అనంతరం నాగేశ్వరరావు అక్కడి నుంచి ఉడాయించాడు. స్థానికులు క్షతగాత్రులిని ఓ దవాఖానకు తరలించారు.